Breaking News: తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి..! - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday 31 March 2020

Breaking News: తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి..!



కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందిసోమవారం ఒక్కరోజే మరో నలుగురు తెలంగాణలో కన్నుమూశారుదీంతో మొత్తం తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరుకుందిఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసిందిఈ మొత్తం ఆరుగురులో గాంధీ ఆసుపత్రిలో ఇద్దరుఅపోలో ఆసుపత్రిలో ఒకరుగ్లోబల్ ఆసుపత్రిలో ఒకరునిజామాబాద్‌లో ఒకరుగద్వాలలో ఒకరు మరణించినట్లు ఆ బులెటిన్‌లో తెలిపారు.

అయితే తెలంగాణలో కరోనాతో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది దిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారే కావడం విశేషంఈ నెల 13 నుంచి 15 వరకు దేశ రాజధాని దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనలు జరిగాయిఈ ప్రార్థనల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారుఆ తర్వాత వీరు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారుఈ ప్రార్థనల్లో పాల్గొన్న చాలా మందికి ఇప్పుడు కరోనా పాజిటివ్‌ గా తేలుతోంది.

ఇప్పుడు మరణించిన వారే కాకుండా ఇంకా పలువురు ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఉన్నారుఇప్పుడు వారందరినీ గుర్తించే పనిలో వైద్యఆరోగ్య శాఖ తలమునకలుగా ఉంది.అంతే కాదు.. ఆ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారందరూ కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ సర్కారు చెబుతోందిఇతరులు కూడా అలాంటి వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని అధికారులు చెబుతున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పెద్ద సంఖ్యలో ఈ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్టు తెలుస్తోందిమొత్తం మీద ఈ మర్కజ్‌ లో జరిగిన ప్రార్థనలు దేశవ్యాప్తంగా కరోనా విస్తరించేందుకు కారణమయ్యాయని చెప్పుకోవచ్చుమరి ఇంకా ఎందరు ఈ కరోనాకు బలవ్వాలో..?

No comments:

Post a Comment

Post Top Ad